అన్ని కుంభకోణాల్లో కిలార్ రాజేశ్ దే కీలక పాత్ర : సజ్జల

-

టీడీపీని నడిపే బాధ్యత ప్రజలేదనట.. కక్ష సాధింపు అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేసే వాళ్లం కదా అన్నారు. అన్ని కుంభకోణాల్లో కిలార్ రాజేశ్ ది కీలక పాత్ర అని సజ్జల  ఇవాళ మీడియాకు వెల్లడించారు. పెద్ద పెద్ద వాళ్లను తీసుకొచ్చి బాబు తప్పు చేయలేదని మాట్లాడిస్తున్నారు. స్కామ్ గురించి అడిగే వాళ్లకు టీడీపీ వాళ్ల దగ్గర సమాధానం లేదు అని..  అలాగే కమ్యూనిస్టులు ఎందుకు బాబుకు తాబులుగా మారారని ప్రశ్నించారు. అమరావతి భూముల స్కాములో చంద్రబాబు పాత్ర ఉందన్నారు.150 ఎకరాల్లో నారాయణ కుటుంబానికి కేటాయించారు.  దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు చంద్రబాబు.

చంద్రబాబుకు రిమాండ్ విధించింది కోర్టే కదా అని ప్రశ్నించారు. మొత్తం 4 కేసుల్లో ఆధారాలున్నాయి. రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చారు. ఐక్యరాజ్యసమితికి వినతి పత్రం ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్ననారు సజ్జల. స్కామ్ లో ఆధారాలు లభించాయని ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిందని తెలిపారు.  డిజైన్ టెక్ ద్వారా కోట్లు కొట్టేశారు. లోకేష్ ఢిల్లీలో ఎందుకు ఉన్నారు. జనం నమ్మక చస్తారా అనే విధంగా టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ప్రజాధనం దోపిడికి గురైందని దర్యాప్తు చేసి సీఐడీ ఆధారాలు కోర్టుకు సమర్పించింది. దోపిడి దొంగల ముఠా అడ్డంగా దొరికిపోయిందని సజ్జల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news