ద్వారంపూడికు మరో షాక్‌…కేసు పెట్టిన మున్సిపల్‌ ఉద్యోగులు

-

former Kakinada MLA Dwarampudi Chandrasekhar Reddy: కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డికి మరో షాక్‌ తగిలింది.. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి సహా 24 మందిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మున్సిపల్ ఉద్యోగులు. తమ విధులకు ఆటంకం కలిగించారని కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి సహా 24 మందిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మున్సిపల్ ఉద్యోగులు.

Another shock for former Kakinada MLA Dwarampudi Chandrasekhar Reddy

ఈ నెల 2న ద్వారంపూడి అనుచరుడు సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడాలు కూల్చడానికి వెళ్ళింది మున్సిపల్ సిబ్బంది. ఈ సందర్భంగా అధికారులను అడ్డుకున్నారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి. అయితే… చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో వచ్చి గొడవకు దిగారని, రెచ్చగొట్టేలా వ్యవహరించారని పేర్కొన్నారు ఉద్యోగులు. ఈ ఫిర్యాదు అందిందని, కేసు నమోదు పై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version