ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

-

ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం రోజున దిల్లీ చేరుకున్న ఆయన ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై సుమారు అరగంటపాటు ప్రధానితో చర్చించారు. అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను చంద్రబాబు కలిశారు. ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. ఇవాళ మధ్యాహ్నం కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హర్దీప్‌ సింగ్‌ పురీతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

చంద్రబాబు దిల్లీ పర్యటన షెడ్యూల్ ఇదే..

12.15 గంటలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ

2 గంటలకు వ్యవసాయ, గ్రామాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్

2.45 గంటలకు హోం మంత్రి అమిత్ షా

శుక్రవారం ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈవో

10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

10.45కి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా

12.30 కేంద్ర మంత్రి అథవాలే

సాయంత్రం తిరిగి దిల్లీ నుంచి హైదరాబాద్ ప్రయాణం

Read more RELATED
Recommended to you

Latest news