ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఈరోజు ఎన్నంటే ?

-

ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది రోజులుగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. తాజాగా కరోనా వైరస్ కేసుల సంఖ్య కొంచెం తగ్గింది. తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6235 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,31,749కు పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 51 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5410కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 74,518 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి.

ap-corona
ap-corona

నేడు కొత్తగా 10,502 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 5,48,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజూ లానే ఈరోజు కూడా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో కూడా ఏడు వందలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలానే కృష్ణాలో 9, అనంతపూర్ 5, చిత్తూరు 7, ప్రకాశం 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 4, కర్నూలు 3, కడప 2, శ్రీకాకుళం 1, పశ్చిమ గోదావరి 4, గుంటూరు 4, నెల్లూరు 4గురు కరోనా వల్ల మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news