ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శుభవార్త అందజేసింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువు తేదీని ఈ నెల 9 వరకు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం మే 15 నుంచి ఈరోజు వరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. అప్పటివరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చెయనుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంలో ఉన్నారు.