2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

-

ఆంధ్ర ప్రదేశ్ గ్రూప్-1 పరీక్షల విషయంలో ఆ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2018లో ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు (AP High Court) తాజాగా తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండు సార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కి పెట్టి, రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని పిటిషనర్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది. మెయిన్స్‌ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధం అని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన హైకోర్టు.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news