వైఎస్ జగన్ని చూసి.. కూటమి సర్కార్ భయపడుతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రేపు వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వని ఏపీ పోలీస్ శాఖ… బిగ్ షాక్ ఇచ్చారు. ఎంత మంది వస్తారన్న వివరాలు ఇవ్వనందు వల్లే పర్మిషన్ ఇవ్వలేదని వెల్లడించారు. ప్రోటోకాల్ కారు, 100 మంది అయితేనే అనుమతి ఇస్తామని పోలీసులు పేర్కొన్నారు..

అయితే.. పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా, పర్యటన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఉదయం 9 గంటలకి బయలుదేరి.. 11 గంటలకు చేరుకోనున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శివనాగ కుటుంబాన్ని పరామర్శించి.. 12 గం. తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు జగన్.