ఏపీలో టీడీపీ, వైఎస్సార్సీపీ కండోమ్ రాజకీయాలు!

-

ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏ క్షణమైన ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి. అటు సిద్ధం పేరుతో వైసిపి ఎన్నికలకు సిద్ధమైంది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ రాజకీయాలలో కొత్త పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి.

కండోమ్ ప్యాకెట్స్ ను పార్టీ గుర్తులతో ముద్రించి జనాలకు పంచుతున్నారు కొంతమంది. టిడిపి అలాగే వైసిపి పార్టీలకు చెందిన గుర్తులను ఉపయోగించి… కండోమ్ ప్యాకెట్స్ తయారుచేసి పంచుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే వీటిని చూసిన జనాలు తెలుగుదేశం అలాగే వైసిపి పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం ఇంతలా బరితెగించాలా ? అంటూ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news