ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు

-

అసలే చలికాలం చలి చంపేస్తోంటే.. మరోవైపు వర్షాలు ప్రజలను మరింత వణికిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో గత రెండ్రోజుల క్రితం వర్షాలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను వణికించేందుకు వరణుడు రెడీ అవుతున్నాడు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని తెలిపింది.

అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. అలాగే రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశముందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news