వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి బెయిల్

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్ దస్తగిరికి అట్రాసిటీ, దాడి కేసులో కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఓ అమ్మాయిని కులం పేరుతో దూషించి కిడ్నాప్ చేసినందుకు దస్తగిరి యత్నించినట్టు బాధితులు ఎర్రగుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్టు చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో రెండు వారాల క్రితం దస్తగిరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.


అయితే దాని నుంచి బయటకు రాకముందే వేముల పోలీసులు దాడి కేసు నమోదు చేసి పిటి వారెంటి కింద అరెస్టు చేశారు. దీంతో ఆయన మళ్ళీ జైలు లోనే  ఉండాల్సి వచ్చింది. దాదాపు 100 రోజులు గా జైలు లోనే  గడుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించి దస్తగిరి బెయిల్ కి దరఖాస్తు చేసుకోగా..  తాజాగా కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news