దసరా స్పెషల్..ఏపీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్

-

దసరా పండుగ వస్తోంది. అయితే.. దసరా పండుగ తరుణంలో ఏపీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. దసరా సందర్భంగా 5,500 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించిన APSRTC మరో గుడ్ న్యూస్ చెప్పింది.

రాను, పోను ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే 10% రాయి తీ లభిస్తుందని అధికారులు తెలిపారు. చిల్లర సమస్య లేకుండా అన్ని ప్రత్యేక బస్సుల్లో ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా టికెట్లు తీసుకునేలా స్వైపింగ్ మిషన్లు ఉంటాయని చెప్పారు.

కాగా, దసరా పండుగకు సెలవులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్కూల్ మరియు కాలేజీలకు పండుగ సెలవులు ఖరారు చేసింది. మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ నా 14వ తేదీ నుంచి దసరా హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ సెలవులు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news