మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్దమా..?

-

సిద్దమా అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. ఏలూరు జిల్లా దెందులూరు వైసీపీ సిద్ధం సభలో మాట్లాడారు. మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరు అంతా సిద్దమా అని ప్రశ్నించారు. ఇంటింటి భవిష్యత్ ను మరింతగా మార్చేందుకు మీరు సిద్ధమా ? అన్నారు. దుష్ట చతుష్ట మీద యుద్ధం చేయడానికి మీరు సిద్ధమా అని అడిగారు.  పేదల భవిష్యత్ పై కాటేసే ఎల్లో వైరస్ పై యుద్దానికి మీరు సిద్దమా అని పేర్కొన్నారు.

రామాయణం, మహా భారతంలో ఉన్న విలన్లు అందరూ..   చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 రూపంలో ఒక్కడే ఉన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా ఏకమై జగన్ ప్రభుత్వం పై కుట్ర చేస్తున్నారు. జగన్ ఏనాడు ఒంటరి కాదు అన్నారు. మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే.. నేను అభిమన్యుడిని అవుతాను అని తెలిపారు. వైసీపీని మరోసారి గెలిపించడానికి మీరు సిద్ధమా అని మరో సారి అడుగుతున్నట్టు తెలిపారు సీఎం జగన్ .

 

Read more RELATED
Recommended to you

Latest news