అధికారాన్ని కాపాడుకోవడానికి హత్యలు : మాజీ ఎమ్మెల్యే అనిత

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై టీడీపీ నాయ‌కురాలు, మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఎస్ . రాయ‌వ‌రం మండ‌లంలోని ధ‌ర్మ‌వ‌రంలో తెలుగు దేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్తల‌తో మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో మాట్లాడిన వంగ‌ల‌పూడి అనిత.. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసింది.

వైఎస్ జ‌గ‌న్.. అధికారం కోసం, అధికారాన్ని కపాడుకోవ‌డం కోసం హ‌త్యలు చేస్తారంటూ అనుచిత వ్యాఖ్య‌లు చేసింది. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో త‌మ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం కోసం సొంత బాబాయి నే హ‌త్య చేయించార‌ని ఆరోపించారు. అధికారం కోసం సొంత బాబాయిని హ‌త్య చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ కే సొంతం అని విమ‌ర్శించారు. కాగ అధికారం చేతిలోకి తీసుకోవ‌డానికే హ‌త్యలు చేసిన జ‌గ‌న్.. అధికారిన్ని నిలుపుకోవ‌డానికి ఎన్ని హ‌త్యలు చేస్తారో.. ప్ర‌జ‌లే ఊహించుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news