జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేలా మహానాడు నిర్వహిస్తాం – అచ్చెన్నాయుడు

-

జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేలా మహానాడు నిర్వహిస్తామని హెచ్చరించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రాజమండ్రిలో టిడిపి మహానాడు ప్రాంగణానికి భూమి పూజ చేశారు టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు.

ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద ఈనెల 27, 28 తేదీల్లో టిడిపి మహానాడు ఉంటుందని… జగన్ పాలనపై విధ్వంసాలు, వినాసాలపై మహానాడులో తీర్మానం అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ మహానాడుకు అత్యంత ప్రాధాన్యం అని…. 100 అతి పెద్ద సభలు ప్రారంభించామని వివరించారు.

27 వరకు 99 పూర్తి చేస్తామని.. 28న ఎన్టీఆర్ శత జయంతి రోజు ముగింపు సభ ఉంటుందని వివరించారు. 15 వేల మందితో కమిటీలు, 15 తీర్మానాలు… 28న 15 లక్షల మందితో మహానాడు బహిరంగసభ ఉంటుందని ప్రకటించారు. దీనికి పోలీసు యంత్రాంగం సహకరించాలని కోరారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version