జగన్‌ ప్రభుత్వంతో లాలూచీ పడ్డాం – బండి శ్రీనివాసరావు

-

జగన్‌ ప్రభుత్వంతో లాలూచీ పడ్డామని ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాది 70 సంవత్సరాల ఉద్యమ చరిత్ర మేం కామ్ గా ఉన్న మాట నిజమేనని.. మేం ప్రభుత్వం తో లాలూచీపడ్డామన్న మాట వాస్తవమేనని వెల్లడించారు. మేం చేసిన ఉద్యమాల ఫలితమే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నవి.. ప్రభుత్వం మాకు ఇచ్చిన సమయం దాటిపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఉద్యమం చేయాలంటే ఏకైక డిమాండ్ పీఆర్సీ మాత్రమేనని.. మేం ఏం చేసినా మా వల్లే వచ్చిందని చెప్పుకోమని వివరించారు. పోలీసులకు సరెండర్ లీవ్స్ వస్తాయని మేం చెప్పాం.. మాకేమైనా చికల జోస్యం తెలుసా..పిల్లి పాలు తాగుతూ అదే ప్రపంచం అన్నట్టు సూర్యనారాయణ మాట్లాడుతున్నాడన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘాన్ని కామెంట్ చేసే కెపాసిటీ సూర్యనారాయణ కు లేదని.. సూర్యనారాయణ సంఘానికి ఏ ముద్దు పేరు పెట్టుకున్నా మాకొచ్చిందేం లేదని ఆగ్రహించారు. పోరాటం చేతకాక కోర్టుకెళుతున్నారు… ఇది మిగతా సంఘాలు కూడా తెలుసుకోవాలి..ప్రభుత్వం తో సాధించుకోవాలి.. కోర్టుకెళ్ళి కాదని చెప్పారు ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు.

Read more RELATED
Recommended to you

Latest news