నంద్యాల నుంచే పొలిటికల్ కెరీర్ ప్రారంభిస్తా – భూమా విఖ్యాత రెడ్డి

-

నంద్యాల నుంచే పొలిటికల్ కెరీర్ ప్రారంభిస్తానని టిడిపి యువ నేత భూమా విఖ్యాత రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నంద్యాలలో మీడియాతో టిడిపి యువ నేత భూమా విఖ్యాత్ కీలక వాఖ్యలు చేశారు. టిడిపి పార్టీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశాన్ని నిర్వహించిన భూమా విఖ్యాత రెడ్డి అనంతరం కీలక ప్రకటన చేశారు.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఆళ్లగడ్డపైనే ఫోకస్ పెట్టమని పార్టీ చెప్పిందని వెల్లడించారు భూమా విఖ్యాత రెడ్డి. తండ్రి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రాణాలు విడిచిన నంద్యాల నుండే పొలిటికల్ కెరీర్ ప్రారంభిస్తానని స్పష్టం చేశారు భూమా విఖ్యాత రెడ్డి. తనను నంద్యాలలో తిరగవద్దనీ పార్టీ చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు భూమా విఖ్యాత రెడ్డి. నంద్యాల నియోజకవర్గంలోని ప్రతి వార్డు, గ్రామంలో పర్యటిస్తానని వెల్లడించారు భూమా విఖ్యాత రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news