క్రిస్టియన్ ఆరోపణలపై టీటీడీ ఛైర్మన్‌ భూమన క్లారిటీ

-

బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు టిటిడి ఛైర్మన్‌ భూమన. విమర్శలకు భయపడేవాడిని కాదని.. నేను నాస్తికుడిననే విమర్శలు చేసే వారికి ఇదే నా సమాధానం అన్నారు. 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తిని అని… దేవుడి దయతో మతాంతీకరణలు ఆపడానికి 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన మూడు తరాల మనిషి పుస్తకావిష్కరణ సభలో విమర్శలకు సమాధానం చెప్పారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి.

తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకుంది నేనేనని… అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ నేనే అంటూ స్పష్టం చేశారు. దళితవాడలకు శ్రీవెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించింది నేనేనని.. నా మీద క్రిస్టియన్ అని నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానం అని వెల్లడించారు. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వాడిని కాదని… పోరాటాల నుండి పైకి వచ్చిన వాడిని ఇలాంటి వాటికి భయపడనని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news