తిరుమల భక్తులకు అలర్ట్‌…రేపు దర్శనాలు రద్దు !

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌…రేపు విఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు కానున్నాయి.  రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరుగనుంది. అలాగే.. రేపు సాయంత్రం పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. దీంతో రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టీటీడి పాలక మండలి.


కాగా, అటు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. టోకేన్ లేని భక్తులు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని దర్శించుకున్న 87171 మంది భక్తులు కాగా….38273 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు శ్రీ వారి హుండి ఆదాయం 3.68 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news