బిగ్ అలెర్ట్.. ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మరో రెండు రోజులపాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని… వాతావరణ శాఖ హెచ్చరికలు దారి చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం… బలపడిందని వెల్లడించింది. దీంతో అల్పపీడనం వాయుగుండం గా మారబోతుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఇదే జరిగితే ఏపీలో రెండు రోజులపాటు వర్షాలు భారీగా కురుస్తాయని తెలిపింది.

andhra-weather-report-1
andhra-weather-report-1

వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే ప్రమాదం పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా ఇవాళ శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైయస్సార్ కడప, శ్రీ సత్య సాయి జిల్లాలో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాలతో పాటు భారీగా ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news