ఏపీలో మరో కొత్త పథకం.. మహిళలకు రూ.15వేలు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఏపీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మహిళల కోసం సరికొత్త పథకాన్ని లాంచ్ చేయబోతోంది కూటమి ప్రభుత్వం. గృహిణి పేరుతో ఈ కొత్త స్కీం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పథకం కింద మహిళలకు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతున్నారు.

chandrababu
chandrababu

ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ పథకం అమలు కావడం కోసం ఏకంగా 400 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపు సంక్షేమ వర్గానికి భారీగా నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ కాపు సామాజిక వర్గం కోసం కొత్త పథకాన్ని తీసుకువస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళ సాధికారత కు తోడ్పాటు జరుగుతుందని.. ఆ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news