BREAKING: పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్….!

-

Peddireddy Ramachandra Reddy in Punganur: చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి భారీ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు పుంగనూరు టిడిపి ఇన్ చార్జ్ చల్లా బాబు. ఛైర్మన్‌ అలీం భాషాకు గాలం వేశారు టిడిపి ఇన్ చార్జ్ చల్లా బాబు. ఈ తరుణంలోనే.. వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు ఛైర్మన్‌ అలీం భాషా.

Big shock for Peddireddy Ramachandra Reddy in Punganur

ఆయనతోపాటు మరో 20 మందిపైగా కౌన్సిలర్లు కూడా వైసిపి పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీని వీడిన వారు… చల్లా బాబు సమక్షంలో మధ్యాహ్నం టిడిపిలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. పుంగనూరు మున్సిపల్ పీఠంపై దృష్టి పెట్టిన టిడిపి నేత చల్లా బాబు..ఛైర్మన్‌ అలీం భాషాకు గాలం వేశారు. మొత్తం 31 మందిలో 20పైగా టిడిపిలోకి వచ్చేలా చక్రం తిప్పారు టిడిపి ఇన్ చార్జ్ చల్లా బాబు. ఈ తరుణంలోనే…పుంగనూరు మున్సిపాలిటీని వైసీపీ పార్టీ కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి మొదటి ఎదురు దెబ్బ తగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news