నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్..!

-

నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీ కి భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. మాజీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు.  మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 16 మంది కౌన్సిలర్లు 2 కో ఆప్షన్ నెంబర్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. కొడుకును కాదని పెదనాన్న పక్షంలో జరిగిన మున్సిపల్ ప్రజాప్రతినిధులు.. మున్సిపాలిటీనీ అభివృద్ధి బాటలో నడిపించాలన్న ఉద్దేశంతోనే టీడీపీలో చేరినట్టు చైర్మన్ సుధాకర్ రెడ్డి తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. దీంతో  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గం నుంచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గంలో చేరారు. దీంతో నందికొట్కూరు  మున్సిపాలిటీ టిడిపి హస్తగతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ చైర్మన్లు టీడీపీ వ్యక్తులుగా మారుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల మారినప్పటికీ.. తాజాగా నందికొట్కూరులో మారడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news