చంద్రబాబు మానిఫెస్టో దెబ్బకు తాడేపల్లిలో భూకంపం వచ్చింది – బోండా ఉమ

-

చంద్రబాబు మేనిఫెస్టో దెబ్బకు తాడేపల్లి పునాదులు కదిలిపోతున్నాయని ఎద్దేవా చేశారు బోండా ఉమ. నిన్న మహానాడులో మహిళలకు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో పై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మహిళలు హర్షం వ్యక్తం చేశారు. బోండా ఉమ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మహిళలు.

ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. మహానాడులో చంద్రబాబు తొలిమానిఫెస్టో ప్రకటించగానే తాడేపల్లి లో భూకంపం వచ్చిందని.. చంద్రబాబు మేనిఫెస్టో దెబ్బకు తాడేపల్లి పునాదులు కదిలిపోతున్నాయని అన్నారు. అందుకే మంత్రులు ఎమ్మెల్యేలు నోటికి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని.. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. 2 కోట్ల మంది మహిళలు చంద్రబాబు ఎప్పుడు సీఎం అవుతారా అని ఎదురుచూస్తున్నారు… చంద్రబాబు చేసిన సంక్షేమం…. జగన్ చేసిన మోసకారి సంక్షేమంపై ఎవరితోనైనా మేము చర్చకు సిద్ధం అని సవాల్‌ చేశారు.
కొడాలి నానితో చర్చించేందుకు గుడివాడైనా తాడేపల్లి ప్యాలెస్ కైనా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం.. కొడాలి నాని సంక్షేమ పై చర్చకు ఒక ఫోన్ కాల్ చేస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని ఛాలెంజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news