తరగతి గదిలో తేలు కాటుతో విద్యార్థి మృతి

-

ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు అండగా నిలవాలంటే చిన్నప్పటి నుంచే మంచిగా చదువుకోవాలనుకున్నాడు ఆ బాలుడు. అలా క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్తూ.. శ్రద్ధగా చదువుకుంటున్న అ చిన్నారి ప్రాణాలను తేలు బలి తీసుకుంది. తరగతి గదిలో తేలు కుట్టడంతో విద్యార్థి మృతి చెందిన ఘటన డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.

కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన అభిలాష్‌ (14).. వాకతిప్ప జడ్పీహెచ్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గురువారం యథావిధిగా పాఠశాలకు వెళ్లిన అభిలాష్.. తన క్లాస్​మేట్స్​తో కలిసి తరగతి గదిలో ఉన్న చెత్తను ఏరుతున్నాడు. ఈ క్రమంలో అతడిని తేలు కుట్టగా.. ఉపాధ్యాయులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఊపిరితిత్తుల్లోకి విషం చేరడంతో, రక్తపు వాంతులు అయ్యి బాలుడు మృతిచెందినట్లు వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసినట్లు అంగర ఎస్సై తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news