BREAKING : విజయవాడ-గుంటూరు మధ్య వారధిపై భారీగా నిలిచిన ట్రాఫిక్

-

BREAKING : విజయవాడ – గుంటూరు ప్రయాణికులకు అలర్ట్. వారధిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. విజయవాడ-గుంటూరు మధ్య వారధిపై భారీగా నిలిచిపోయింది ట్రాఫిక్. సుమారు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి వాహానాలు. దీంతో దాదాపు రెండు గంటల నుంచి నిలిచిపోయింది ట్రాఫిక్. భారీగా ట్రాఫిక్ స్ధంభించినా పోలీసులు…పట్టించుకోవడం లేదు.

Heavy traffic on the bridge between Vijayawada-Guntur
Heavy traffic on the bridge between Vijayawada-Guntur

ఓ ప్రైవేట్ బస్సు టైర్ పేలి పోవడంతో వారధి మీద ట్రాఫిక్ నిలిచింది. ఉదయం ఎనిమిది గంటలకు వారధిపై నిలిచిపోయింది బస్సు. రెండు గంటల తర్వాత క్రేన్ సాయంతో ఆగిన బస్సును తొలగించారు పోలీసులు. సుమారు రెండు గంటల నుంచి ట్రాఫిక్ స్ధంభించడంతో గగ్గోలు పెట్టారు వాహన చోదకులు. అయినప్పటికీ… పోలీసులు పట్టించుకోలేదట. అయితే.. మీడియో ఎంట్రీ ఇవ్వడంతో… రెండు గంటల తర్వాత క్రేన్ సాయంతో ఆగిన బస్సును తొలగించారు పోలీసులు. దీంతో విజయవాడ-గుంటూరు మధ్య వారధిపై ట్రాఫిక్‌ క్లియర్‌ అవు తోంది.

Read more RELATED
Recommended to you

Latest news