బ్రేకింగ్: ఏపీలో కొత్తగా 8 వేల కేసులు

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గత 24 గంటల్లో 8 వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 8 వేల 12 కేసులు నిన్న ఒక్క రోజు నమోదు అయ్యాయి అని వెల్లడించింది. మొత్తం కేసులు 2 లక్షల 89 వేల 829 కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 88 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 2 వేల 650కి చేరుకుంది.

ap-corona
ap-corona

రోజుతో పోలిస్తే ఏపీలో కేసులు మరణాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 85 వేల 945 గా ఉన్నాయి. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 2 లక్షల 1234 మంది కోలుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనా కేసులు రోజుతో పోలిస్తే తగ్గుతున్నాయి. గోదావరి జిల్లాల్లో కరోనా ఉదృతి ఇంకా కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news