వివేకా హత్య కేసులో జగన్ సూత్రధారి.. అవినాష్ పాత్రధారి – బుద్దా వెంకన్న

-

టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో జగన్ సూత్రధారి.. అవినాష్ పాత్రధారి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. వివేకా హత్య విషయమై ఇంకా లోతైన దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు. జగన్ గురించే కాదు.. జగన్ వెనుక ఎవరున్నారో కూడా తేలాలని కోరారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. వివేకా హత్య కేసులో సాక్ష్యం చెప్పిన షర్మిళకు ప్రాణహని ఉందని.. కేంద్రం షర్మిళకు వై కేటగిరి భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సునీతా రెడ్డి ఉక్కు మహిళ… ఓ సైకో సీఎం మీద పోరాడడం మామూలు విషయం కాదన్నారు.


షర్మిళకు ఎంపీ సీటు ఇవ్వకూడదని జగన్ అనుకున్నారని.. షర్మిళ ఎంపీ సీటు కోసం వివేకా పట్టుబట్టారన్నారు. వివేకా అడ్డుగా ఉన్నారని హత్య చేశారని ఫైర్‌ అయ్యారు. లోటస్ పాండ్ లోనే వివేకా మర్డర్ స్కెచ్ వేశారని తెలిపారు. వివేకా హత్య విషయం తెలిసిన వెంటనే జగన్ పులివెందులకు ఎందుకు వెళ్లలేదు..? అని ప్రశ్నించారు. పులివెందులకు వెళ్లాక జగన్ నేరుగా వివేకా మృతదేహం వద్దకు వెళ్లకుండా.. ఇంటికి ఎందుకెళ్లారు..? అని నిలదీశారు. హత్య విషయం ఉదయం తెలిస్తే సాయంత్రం ఐదు గంటలకు వెళ్లడం ఏంటీ..? అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news