BREAKING : నేటి సాయంత్రం నుండి పెట్రోల్, డీజిల్ బంక్ లు బంద్… !

-

పాకిస్తాన్ ప్రజలకు ఆ దేశంలోని పెట్రోల్ మరియు డీజిల్ బంక్ డీలర్స్ షాక్ ఇచ్చారని చెప్పాలి. పెట్రోల్ మరియు డీజిల్ బంక్ డీలర్ ల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం నుండి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బంక్ లకు బంద్ ప్రకటించనున్నారు. ఈ రోజు సాయంత్రం నుండి పాకిస్తాన్ లోని 10 వేల పెట్రోల్ బంక్ డీలర్లు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఇక ఎటువంటి అత్యవసరం ఉన్న సరే బంక్ ను తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో అధిక ద్రవ్యోల్భణం కారణంగా పాకిస్తాన్ కరెన్సీ బలహీన పడడమే ఇందుకు ప్రధాన కారణంగా వీరు చెబుతున్నారు. అంతే కాకుండా పాకిస్తాన్ లోకి ఇరాన్ దేశానికి చెందిన ఇంధనాన్ని అక్రమంగా రవాణా చేయడం పైన కూడా డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సడెన్ గా పెట్రోల్ బంక్ డీలర్లు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news