సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్..తండ్రిపైన కూడా !

-

విశాఖ సాయి ప్రియ కేసు లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సాయి ప్రియ తండ్రి రామిరెడ్డి అప్పల రాజు పై కేసు నమోదు అయింది. సాయి ప్రియ ప్రేమ వ్యవహరం తెలిసినా ఏమి చెప్పకుండా దాచి ఉంచి, బాద్యత రహిత్యంగా వ్వవహరించారు తండ్రి అప్పల రాజు. అయితే.. ఈ నేపథ్యంలోఏ.. ఉద్దేశ్య పూర్వకంగానే జిల్లా యంత్రాన్ని,పోలీసులను,కోస్ట్ గార్డ్ ను తప్పుదోవ పట్టించడం కారణంగా తండ్రి అప్పల రాజుపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇది ఇలా ఉండగా… విశాఖలో పోలీసులను బురిడీ కొట్టించిన సాయి ప్రియ, ఆమె ప్రియుడు రవితేజ పై నిన్న కేసు నమోదయిన సంగతి తెలిసిందే. జులై 22న విశాఖ బీచ్ లో సాయి ప్రియ కనిపించకుండా పోయారు. ఈ విషయమై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం నేవీ, సముద్ర తీరంలో గస్తీ దళం ముమ్మరంగా గాలించాయి. కానీ సాయి ప్రియ బీచ్ నుండి ప్రియుడితో పరారై అందరిని తప్పు ద్రోవ పట్టించారు. ప్రభుత్వ ధనం, సమయం వృధా చేసినందుకు సాయి ప్రియ ఆమె ప్రియుడుపై కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయి ప్రియ చేసిన పనికి విలువైన ప్రజాధనంతో పాటు, నేవీ కోస్ట్ గార్డ్ పోలీసుల సమయం వృధా అయ్యిందంటున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version