జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై చంద్రబాబు సీరియస్ !

-

కుప్పం : కుప్పం నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడు, సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై నోరు పారేసుకున్నారు. ప్రజాదర్బార్‌ కవరేజికి జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘ నాయకుడు, ఓ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న శివ వచ్చాడు.

అతన్ని చూసిన చంద్రబాబు పీఏ మనోహర్‌ ‘సార్‌ ఇతను కుప్పంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని బ్యానర్లు వేస్తున్నాడని’ చంద్రబాబు చెవిలో వేశాడు. దీంతో రెచ్చిపోయిన చంద్రబాబు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘ నాయకుడు శివను చూసి హెచ్చరికలు చేశారు.

అభిమానం వేరు.. పార్టీ వేరు.. పార్టీలో చీలికలు తేవడం మంచిది కాదంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. పార్టీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తావన తేవద్దని సంకేతాలు ఇస్తూ చంద్రబాబు ఊగిపోయారు. ఏదేమైనా తన మూడు రోజుల కుప్పం పర్యటలో అనుకున్నది జరగలేగదనే ఫ్రస్టేషన్, తమ్ముళ్లు పనికిరాకుండా పోయారనే అసంతృప్తి చంద్రబాబు మొహంలో కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news