నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూసుకెళ్తున్నారు. ఎక్కడ తగ్గకుండా ముందుకు వెళ్తున్నారు. పాలనపై దృష్టి పెట్టిన నారా చంద్రబాబు నాయుడు ఏపీకి.. పెట్టుబడును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ లో పర్యటించబోతున్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో.. పలు పరిశ్రమలను ఇవాళ ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

ఆంధ్రప్రదేశ్ సీఎంఓ వివరాల ప్రకారం ఉండవల్లి నుంచి ఇవాళ 10 గంటలకు బయలుదేరుతారు నారా చంద్రబాబు నాయుడు. అనంతరం ఉదయం 11:30 గంటలకు తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి శ్రీ సిటీకి చేరుకున్న తర్వాత…పలు పరిశ్రమలను ప్రారంభిస్తారు. ఇక 7 కొత్త సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత అక్కడ ప్రసిద్ధులతో సమావేశం అవుతారు. అనంతరం నెల్లూరుకు పయనమవుతారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news