చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు: మంత్రి రోజా

-

రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు చంద్రబాబు, లోకేష్ అని ఏపీ మంత్రి ఆర్.కె.రోజా మండిపడ్డారు. వాళ్ల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా.. 13 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న ఏనాడు ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు. కరోనా, వరదలు వంటి సంక్షోభాల సమయంలోనూ ప్రజలకు అండగా ఉండలేదన్నారు. అప్పుడు సాయం చేయని వారు ఇప్పుడు చేస్తామంటే ఎవరూ నమ్మడం లేదన్నారు.

మహిళలని కూడా చూడకుండా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలపై పార్టీ నేతలతో తిట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును మహిళలు, విద్యార్థులు, రైతులు తరిమి కొడతారని అన్నారు రోజా. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముంచేసి వెళ్లారని రోజా విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటికి ఎదురొడ్డి జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఒకే ఒక్క సీఎం అని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news