ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి – చంద్రబాబు

-

ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాట్‌ కామెంట్స్‌ చేశారు. గత నాలుగు రోజుల నుంచి ఏపీలో మరోసారి ముందస్తు ఎన్నికల మాట వినిపిస్తోంది. స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారట.

రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని, అది కూడా వచ్చే ఏడాది మే, లేని పక్షంలో డిసెంబర్ లో ఎన్నికలు రావోచ్చని చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించారట. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నాయకులంతా సిద్ధంగా ఉండాలని, ఎన్టీఆర్ జిల్లా నేతలతో సమీక్ష సందర్భంగా ప్రస్తావించారట. కేడర్ కు కూడా దిశా నిర్దేశం చేశారట. రాబోయే రోజుల్లో కార్యకర్తలు నేతలు ప్రజల్లో ఉండాలని, తాను కూడా ప్రజల్లో ఉండేలా కార్యాచరణను రూపొందిస్తున్నట్లు చెప్పారట.

Read more RELATED
Recommended to you

Latest news