జైల్లో నన్ను చంపేందుకు కుట్రలు చేశారు – చంద్రబాబు మరో సంచలనం !

-

జైల్లో నన్ను చంపేందుకు కుట్రలు చేశారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు బాబు. గత 5 ఏళ్లలో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది నేనేనని.. 53 రోజులు జైల్లో ఉంది నేనే, నన్ను చంపాలని చూశారనే ప్రచారమూ జరిగిందని తెలిపారు. జైలు మీద డ్రోన్లు కూడా ఎగురవేశారు… నా ప్రతీ కదలిక గమనించటానికి జైలు గదిలో సీసీ కెమెరా కూడా పెట్టారని వివరించారు.

jagan comments on chandrababu white paper

కనీసం వేడి నీళ్లు ఇవ్వలేదు, దోమలు కుడుతుంటే కనీసం దోమ తెర లేదని తెలిపారు. ఇంత అనుభవించిన నేను.. బయటకు రాగానే ముందు కక్ష తీర్చుకోవాలి కదా? అని పేర్కొన్నారు. నాది ఆ స్వభావం కాదని సెటైర్లు పేల్చారు. గత 5ఏళ్లు ఇబ్బందులు పడిన వారి బాధలు నాకు తెలుసు అన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరు, సరైన సమయంలో చర్యలు ఉంటాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version