పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగురేస్తాం – చంద్రబాబు

-

పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగురేస్తామని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో జగన్‍కు షాక్ తగిలిందన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ గాల్లో పల్టీలు కొట్టాడని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో టీవీలు పగిలిపోతున్నాయన్నారు చంద్రబాబు.

సీఎం జగన్ ఎంతో కసరత్తు చేసి.. చివరికి బొక్క బోర్లా పడ్డారని ఏ దేవ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారని అన్నారు. జగన్‍పై చాలమంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందన్నారు చంద్రబాబు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలే తమ అసంతృప్తిని బయటపెట్టారని అన్నారు. బయటకు రాని ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. నమ్మకంగా ఉండే నేతలే జగన్‍ను వీడి వెళ్తున్నారని.. నమ్ముకున్న వ్యక్తిని నట్టేట ముంచితే నాయకుడు కాదన్నారు. పులివెందులలో కూడా టీడీపీ జెండా రెపరెపలాడిందన్నారు. జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్నారు. జగన్ రెడ్డి రాజధాని అమరావతిని భ్రష్టు పట్టించారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news