పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ తలుచుకుంటే జగన్ బొచ్చు పీకేస్తారు – చంద్రబాబు

-

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ తలుచుకుంటే జగన్ బొచ్చు పీకేస్తారని హెచ్చరించారు చంద్రబాబు. జగన్ వస్తే బహిష్కరించాలి…నువ్వొద్దు.. నీ పార్టీ వద్దని జగనుకు చెప్పాలని పేర్కొన్నారు చంద్రబాబు. తాను ఒంటరిగా వస్తున్నానని జగన్ అంటున్నారు.. కానీ జగన్ శవాలతో వస్తున్నాడు….తండ్రి లేడని ఓసారి.. తండ్రి, బాబాయ్ లేడని మరోసారి వచ్చిన జగన్.. ఇప్పుడు వృద్ధుల శవాలతో వస్తున్నాడని పేర్కొన్నారు.

జోగి రమేష్ శవ రాజకీయాలు ప్రారంభించాడు…ఇస్తానన్న టిక్కెట్ కూడా వద్దని బాలసౌరీ, పార్దసారధిలు వచ్చేశారు…మంచోళ్లకు వైసీపీలో చోటు లేదన్నారు.బూతుల నాని, వంశీ, పేర్ని నాని, జోగి రమేష్ వంటి వారే.ఆ పార్టీలో ఉండగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు కండకావరం పెరిగింది….ముస్లిం మహిళ బురఖా ఎత్తి చూస్తారా..? అంటూ నిలదీశారు. ఎందుకు బురఖా తప్పించారని అడిగితే ముస్లింలని చెప్పుతో కొడతారా..? పెనమలూరులో ప్రజాభిమానం చూశాక నాపై మరింత బాధ్యత పెరిగిందని అర్థమైందని ఆగ్రహించారు. పవన్ను అడ్డుకుంటారా..? పవన్ను అవమానిస్తారా..?పవన్ అభిమానులు తలుచుకుంటే జగన్ బొచ్చు పీకేస్తారని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news