ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. రేపటి నుంచి రేషన్ షాపుల వద్దనే నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజలకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడే నిత్యవసర సరుకులు తెచ్చుకునేలా ఏర్పాటు చేశామని చంద్రబాబు వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిస్తామని చెప్పారు.

ఒకవేళ రేషన్ సరుకులు వద్దనుకుంటే DBT పద్ధతిలో నగదు ఇస్తామని అనౌన్స్ చేశారు. రేషన్ షాప్ లు జూన్ 1 నుంచి 15వ తేదీ తీసి ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్య సమయంలో పనిచేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ విషయం తెలిసిన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా తీసుకువచ్చిన ఈ సేవలను కొనియాడుతున్నారు.