చంద్రబాబు, పవన్.. జగన్ నామస్మరణ చేస్తున్నారు : నందిగం సురేష్

-

చంద్రబాబు, పవన్.. జగన్ నామస్మరణ చేస్తున్నారు అని ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. నిన్న జరిగిన జెండా సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మీడియా సమావేశంలో స్పందించారు నందిగం సురేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ జీవితంలో ఏనాడూ ఎమ్మెల్యే కూడా కాలేడుఅన్నారు.  సీఎం జగన్ అనే పేరు వింటేనే చంద్రబాబు, పవన్ కి భయం పుడుతోంది అన్నారు.

అందుకే నిన్నటి సభలో 200 సార్లు జగన్ పేరు ప్రస్తావించారు.  పావలా బిళ్ల కింద పడితే గోలగోల చేసినట్టే పవన్ మాట్లాడారు. ఎవరి సలహాలు వద్దనటం వలనే చివరికి చంద్రబాబు పంచన చేరాల్సి వచ్చింది పవన్తో సినిమాలు తీయటానికి కూడా ఏ నిర్మాత ముందుకు రావటం లేదు ఎమ్మెల్యే కాలేక, సినిమాలు ఆఫర్లు లేక పవన్ ఫ్రస్టేషన్ లో ఉన్నారు చంద్రబాబు, పవన్  జెండాలు మార్చుకుని ఊపుకునే స్థితికి వెళ్లారు వివేకా హత్య వెనుక చంద్రబాబు ఉన్న సంగతి పవన్ కి తెలుసు అన్నారు.

తన స్వార్ధం కోసం కన్నతండ్రిపై కూడా పవన్ నీచంగా మాట్లాడారు. ఊసకాళ్లతో ఉండే పవన్ తాడేపల్లిలో జగన్ ఇంటిని బద్దలు కడతాడంట.  గత ఎన్నికల్లో పవన్ ని రెండు చోట్లా జగన్ ఓడించి పాతాళంలోకి తొక్కారు.. 14 ఏళ్ల తన పాలనలాగే మళ్లీ చేస్తానని చంద్రబాబు చెప్పగలరా? తన వలన మేలు జరిగితేనే ఓటెయ్యమని సీఎం జగన్ ధైర్యంగా చెప్తున్నారు. తన అభిమానులు, జగన్ ఒకేలా పవన్ కి కనిపిస్తున్నారు  అని పేర్కొన్నారు ఎంపీ నందిగం సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news