ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

-

ఏపీలోని ప్రకాశం జిల్లాలో దర్శి సమీపంలో సాగర్‌ కాల్వలోకి పెళ్లి బృందం బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదం జరగడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఏపీలో వరుస ప్రమాదాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని చంద్రబాబు ఆవేదన చెందారు.

మరోవైపు పెళ్లిబస్సు ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లి బృందానికి జరిగిన ప్రమాదం మాటలకు అందని విషాదమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలవాలని కోరారు.

ఇంకోవైపు రోడ్డు ప్రమాద ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news