BREAKING : అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట…చంద్రబాబుకు ఆహ్వానం

-

టీడీపీ అధినేత చంద్రబాబుకు అరుదైన గౌరవం దక్కింది. అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ నెల 22వ తేదీన అయోధ్య రామజన్మభూమి దేవాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది.

chandrababu receives invitation for Pran Pratishtha event

ఈ మేరకు చంద్రబాబుకు ఆహ్వానం పంపారు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు. కాగా, అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22వ తేదీన జరగనున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం అయ్యేందుకు ఇప్పటికే దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ట్రస్టు సభ్యులు ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news