ప్రకాశం జిల్లా బస్సు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

-

అమరావతి: ప్రకాశం జిల్లా బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. పొదిలికి చెందిన పెళ్లి బృందం బస్సు కాలువలోకి దూసుకు వెళ్లి ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 30 మందికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు చంద్రబాబు. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయన్నారు.

బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో వేడుకగా పెళ్లి ముగించుకొని కాకినాడలో రిసెప్షన్ కోసం వెళుతున్న ముస్లిం కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో అసువులు బాయడం అత్యంత విచారకరం అన్నారు. గత రాత్రి జరిగింది ప్రమాదమా.? మానవ తప్పిదమా.? లేక ఆర్టీసీ బస్సు సాంకేతిక స్థితి సక్రమంగా లేదా అనే విషయంపై అధికారులు దర్యాప్తు చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news