మూడు నెలల అనంతరం ఎన్టీఆర్ భవన్​కు చంద్రబాబు – టీడీపీలో చేరికలు షురూ

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకలాపాల్లో బిజీ అయ్యారు. ఇటీవలే పుణ్యక్షేత్రాల సందర్శన నుంచి వచ్చిన ఆయన ఇక ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే దాదాపు మూడు నెలల తర్వాత ఇవాళ ఆయన ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లడం ఇదే తొలిసారి.

ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై టీడీపీ నేతలతో చంద్రబాబు ఇవాళ సమావేశమయ్యారు. రాష్ట్ర తాజా రాజకీయాలు, రానున్న ఎన్నికలు, పార్టీ కార్యకలాపాలు, చేరికలు ఇతర విషయాలపై నేతలతో బాబు చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు రాకతో ఇవాళ టీడీపీలో చేరికలు కూడా ప్రారంభమయ్యాయి. కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు వైస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

మరోవైపు చంద్రబాబు రాక పార్టీ కార్యాలయంలో కొత్త ఉత్సాహం వచ్చినట్లైందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. వైసీపీ అక్రమ కేసుల నుంచి చంద్రబాబు త్వరలోనే కడిగిన ముత్యంలా బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news