చంద్రబాబు మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి – మంత్రి ధర్మాన

-

ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. 14 ఏళ్ళు సీఎం గా పనిచేసిన చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు నైనా పూర్తి చేశారా..? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో వంశోద్ధార ప్రాజెక్టుకు సమస్యలు లేకుండా సీఎం జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమై చర్చించారని గుర్తు చేశారు. కరోనాతో రెండేళ్లు కష్టాలు ఎదురైనా రెండు వేల కోట్లతో పనులు చేశామని చెప్పారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారి సాగునీటి ప్రాజెక్టులు మొదలుపెట్టింది డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. చంద్రబాబు ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులు పూర్తి కాలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేశామని చంద్రబాబు ఏ ఒక్క ప్రాజెక్టు పేరు అయినా చెప్పగలరా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news