చిన్నారిపై చిరుత దాడి..నెల్లూరులో విషాద ఛాయలు

-

 

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో బాలిక మృతి చెందింది. తిరుమలకు కాలినడకన వెళుతుండగా లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద ఈ ఘటన ఇవాళ చోటుచేసుకుంది. దీంతో బాలిక లక్షిత స్వగ్రామమైన నెల్లూరు జిల్లా కోవూరులోని పోతిరెడ్డిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నెల్లూరు జిల్లాలోనే ఆటో డ్రైవర్ గా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్న దినేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి మొన్న తిరుమలకు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. ఇక దర్శనం చేసుకొని తిరిగి వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఈ సమాచారం తెలియడంతో దినేష్ బంధువులు సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. అందరితో కలుపుగోలుగా ఉండే దినేష్ కుటుంబంలో ఈ విషాదం జరగడం శోచనీయమని అంటున్నారు స్థానికులు. ఎంతో చలాకీగా ఉండే లక్షిత మృతి చెందిందని విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news