మదనపల్లె కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన CID అధికారులు..!

-

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఫైల్స్ దగ్గం కేసు గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణ అనేది జరుగుతూనే ఉంది. ఇక ఈ కేసును మొదట ప్రమాదం అనే కోణంలో పోలీసులు పరిశీలించారు. కానీ ఆ తర్వాత ఇది ఎవరో కావలెను చేసారు అనే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే ఇది ప్రమాదం కాదు.. కావాలనే చేసారు అని తెలిసిన తర్వాత దాదాపు వారం రోజుల కిందట ఈ కేసును CID కి బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం.

ఇక కేసు CID కి వెళ్లిన తర్వాత మొదటి సారిగా ఈ ఘటన జరిగిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు CID అధికారులు. కేసు విచారణలో భాగంగా సబ్ కార్యాలయానికి వచ్చారు CID అడిషనల్ DG, ASP, CID DSP. అయితే ఘటన స్థలాన్ని పరిశీలించిన CID అధికారులు ఈ కేసులో విచారణ ఇంకా జరుగుతుంది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news