పేదవాడి ఇంట్లో టీ తాగిన సీఎం చంద్రబాబు

-

పేదవాడి ఇంట్లో టీ తాగారు సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ ఎస్టీ కుటుంబానికి సీఎం చంద్రబాబు పెన్షన్ అందించారు. పాముల నాయక్‌కు వృద్ధాప్య పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ అందజేశారు. అనంతరం వారి ఇంట్లోనే టీ తాగి అరగంట పాటు వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

CM Chandrababu personally gave pensions to the beneficiaries

దీంతో తమకు ఇల్లు కావాలని వారు సీఎంను కోరడంతో వెంటనే ఇల్లు మంజూరు చేస్తూ అప్పటికప్పుడు ఇంటి మంజూరు పత్రాలను చంద్రబాబు వారికి అందచేశారు. అయితే… ఈ సందర్భంగా ఆ పేదవాడి ఇంట్లో టీ తాగారు సీఎం చంద్రబాబు.  అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో నేను నిరూపిస్తా.. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలన్నారు. వాటిని దాయకూడదు.. నా పాలనలో హడావిడి ఉండదు.. ప్రజలతో మమేకం కావడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version