ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.. 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి-సీఎం వైఎస్‌ జగన్‌

విశాఖలో గ్లోబల్‌ సమ్మిట్‌ జరగడం గర్వంగా ఉందని.. ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.. 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని సంచలన ప్రకటన చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. 340 పెట్టుబడుల ప్రతిపాదనలు మా ముందుకు వచ్చాయి.. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు.. ఇవాళ 8.54 లక్షల కోట్ల ఎంవోయూలు జరుగుతాయన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

అలాగే ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ఏపీ సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. విశాఖే పరిపాలనా రాజధాని అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని వివరించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌. పెట్టుబడులకే కాదు పకృతి అందాలకు విశాఖ నెలవు అన్నారు. ఇండియాలో అతి కీలకమైన రాష్ట్రం ఏపీ అని వివరించారు. ఆరు రేవులు రాష్ట్రమంతా విస్తరించి ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం చిన్న ఎకనామిక్‌ హబ్‌.. సెప్టెంబర్‌లో వన్‌ ఎర్త్‌, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌.. మీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన సిటీ వైజాగ్ అని వివరించారు సీఎం జగన్‌.