ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స -సీఎం జగన్‌

-

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం అని ప్రకటించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ…వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పై అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.

cm jagan on arogya shree

ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం.. ఆరోగ్యం, విద్య ప్రజలకు ఒక హక్కు గా లభించాలన్నారు. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ అంశాలపై విశేష కృషి చేశామన్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ అన్నారు. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టాం అని వెల్లడించారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version