ఉద్యోగుల డీఏను దసరా కానుకగా అందిస్తాం – సీఎం జగన్‌

-

 

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగులకు సీఎం జగన్ వరాల జల్లులు కురిపించారు. పెండింగ్ లో ఉన్న డీఏను దసరా కానుకగా అందిస్తామని ప్రకటించారు సీఎం జగన్‌. హెల్త్ విభాగంలో మహిళా ఉద్యోగులకు 5 రోజుల క్యాజువల్ లీవ్ ఇస్తామని కూడా ప్రకటించారు సీఎం జగన్‌. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్జీవోస్ సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరిగా తాము ఎవరికి అన్యాయం చేయలేదని… వారు పక్కన పడేసిన అనేక సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ‘ఇచ్చిన హామీ మేరకు పదివేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. వారికి మినిమం పేస్కేల్ అమలు చేస్తున్నాం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బతికించి కార్మికులకు అండగా నిలిచాం. 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసాం. కారుణ్య నియామకాల్లో పారదర్శకత పాటించాం’ అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news