కాపుల ఓట్లు అమ్మడానికే పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నం – సీఎం జగన్

-

కాపుల ఓట్లు అమ్మడానికే పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నం చేస్తున్నాడని సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయాలు దిగ జరిపోయాయని.. కాపులు ఓట్లు మూట కట్టి చంద్రబాబు కి అమ్మేయడానికి దత్తపుత్రుడు ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహించారు.నేడు ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోలు లో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా వైయస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలు చేస్తే బాధ అనిపిస్తుందని… హుదుద్ వచ్చినప్పుడు కుటుంబానికి 4 వేలు ఇచ్చామని చంద్ర బాబు అబద్దాలు చెప్తున్నాడని నిప్పులు చెరిగారు.

తుపాన్ వచ్చిందంటే ఎక్కడికక్కడడే మోహరిస్తున్నామని.. చంద్రబాబు తుపాన్ సాయం అందలేదని ఒక్కరిని చూపించలేక పోయాడని ఫైర్‌ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బటన్ నొక్కిన వెంటనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా మహిళల అకౌంట్లో డబ్బులు వెళ్లిపోతున్నాయి. కానీ చంద్రబాబు హయాంలో (DPT) పథకాలు జరిగేవని..DPT అంటే.. దోచుకో, పంచుకో, తినుకో అనే స్కీం ద్వారా జరిగేవని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version